అమరావతి: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 75 కరోనా(కోవిడ్-19) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 722కు చేరుకుంది. వీరిలో 92 మంది డిశ్చార్జ్ కాగా, 20 మంది మరణించారు. ఇక ప్రస్తుతం 610 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం కోవిడ్-19 కేసులకు సంబంధించిన బులెటిన్ను విడుదల చేసింది. జిల్లాల వారీ వివరాల ప్రకారం అనంతపురంలో కొత్తగా 4, చిత్తూరులో 25, తూర్పు గోదావరిలో 2, గుంటూరులో 20, కడపలో 3, క్రిష్ణాలో 5, కర్నూలులో 16 కేసులు నమోదయ్యాయి. ఇక నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొత్తగా ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు.
ఏపీలో కొత్తగా 75 పాజిటివ్ కేసులు